ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు

మోత్కూరు అక్టోబర్ 31 జనంసాక్షి : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా మంగళవారం మండలంలోని పొడిచేడు లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ లెంకలపల్లి భిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టంగూర్ సైదులు, వంగాల సత్తయ్య, నల్ల రామనర్సయ్య,నాతి ఎల్లయ్య, వంగాల కొండయ్య, జిట్ట పెద్ద నర్సయ్య, కసరబాద లచ్చయ్య, నర్రె భిక్షం, జిట్ట సైదులు, రచ్చ శివ, చందు ఇట్టబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.