ఇది ప్రాంతీయపార్టీల ఫ్రంట్‌ విజయం: మమతా బెనర్జీ

కోల్‌కతా,మే19( జ‌నం సాక్షి): కర్నాటక పరిణామాలు ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌ విజయంగా బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ అభివర్ణించారు.  కర్ణాటక శాసనసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయడంపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌ విజయంగా ఈ పరిణామాలను అభివర్ణించారు. జేడీఎస్‌ చీఫ్‌ దేవె గౌడ, కుమార స్వామి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్యలను మమత బెనర్జీ అభినందించారు. దీంతో బిజెపికి చెంపదెబ్బలాంటిదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్న వారు బొక్కబోర్లా పడ్డారని అన్నారు. 
——