ఇరాన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూకంపం

ఇస్లామాబాద్‌ : ఇరాక్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఈ ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్వేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. నిన్న సరిహద్దు ప్రాంతంలో 7.8 తీవ్రతతో కూడిన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఇరాన్‌లో 40 మంది, పాక్‌లో 34 మంది మరణించిన విషయం తెలిసిందే.