ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం పతాక స్థాయికి..

` ఇరుదేశాల ఘర్షణల్లో అమెరికా ఎంట్రీ
` టెహ్రాన్‌లోని అణుకేంద్రాలపై ట్రంప్‌ సేనల దాడులు
` ఫోర్డో, సంతాజ్‌, ఇస్ఫాహన్‌లపై ‘బీ`2 స్పిరిట్‌’ ద్వారా బంకర్‌ బ్లాస్టర్‌ బాంబుల ప్రయోగం
` కీలకమైన మూడు అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన ట్రంప్‌
` ప్రతిగా ఇజ్రాయెల్‌లపై విస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్‌
`ఇజ్రాయెల్‌ గగనతలం మూసివేత.. పలు నగరాలలో హైఅలర్ట్‌
` అటు అమెరికాలో అత్యవసరపరిస్థితి విధింపు
` న్యూయార్క్‌, వాషింగ్టన్‌లలో భద్రత కట్టుదిట్టం
న్యూయార్క్‌,ట్రెహాన్‌(జనంసాక్షి):అమెరికా అనుకున్నంత పని చేసింది. ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఇరాన్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని తాము సంపూర్ణంగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడిరచారు. దానిపై ఏకంగా ఆరు బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించామన్నారు. ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇందుకోసం బీ-2 స్టెల్త్‌ బాంబర్లను వాడినట్లు వెల్లడిరచారు. ఇస్ఫహాన్‌, నతాంజ్‌పై తమ సబ్‌మెరైన్‌ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు.
14 బంకర్‌ బస్టర్‌లతో దాడి : పెంటగాన్‌
ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడిరచింది. దీనిని ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’గా పేర్కొన్న పెంటగాన్‌.. దీంతో ఇరాన్‌లోని అణుకార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగిందని తెలిపింది. ఈ దాడులు చేసినప్పటికీ యుద్ధాన్ని కోరుకోవడం లేదని తెలిపింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడం తమ దాడుల ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ మీడియాకు వెల్లడిరచారు. ‘’ఇరాన్‌లో పాలనా మార్పును కోరుకోవడం లేదు. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడం మా దాడుల ఉద్దేశం కాదు. మా కమాండ్‌-ఇన్‌-చీఫ్‌ (ట్రంప్‌) నుంచి వచ్చిన ఆదేశాలను పాటించాం. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశాం.మొత్తంగా 14 బంకర్‌-బస్టర్‌ బాంబులను జారవిడిచాం. వీటికి పలు యుద్ధవిమానాలు సహాయంగా నిలిచాయి’’ అని పీట్‌ హెగ్‌సేత్‌ వెల్లడిరచారు.
ఆపరేషన్‌ కొనసాగిందిలా..
‘’శుక్రవారం అర్ధరాత్రి ఈ ఆపరేషన్‌ మొదలైంది. అమెరికా నుంచి బీ-2 బాంబర్లు మొదలుకాగా.. డెకాయ్‌లో భాగంగా (దృష్టిమరల్చడానికి) కొన్ని పశ్చిమానికి, మిగతావి తూర్పునకు వెళ్లాయి. 18 గంటల ప్రయాణం అనంతరం ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. 30 వేల పౌండ్ల బరువు కలిగిన 14 బాంబులను అణు కేంద్రాలపై జారవిడిచాం. ఇస్ఫహాన్‌పై తొమాహాక్‌ క్షిపణులను ప్రయోగించాం. ఈ ఆపరేషన్‌లో ఏడు బీ2 బాంబర్లు సహా మొత్తం 125కు పైగా యుద్ధ, ఇంధన, నిఘా విమానాలు పాల్గొన్నాయి. ఫోర్దో, నతాంజ్‌లపై సాయంత్రం 6.40 గంటలకు దాడులు చేపట్టి.. 7 గంటలకు ఇరాన్‌ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. ఇరాన్‌ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఈ దాడులు జరిగాయి ‘’ అని ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’ జరిగిన క్రమాన్ని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ డేనియల్‌ కెయిన్‌ వెల్లడిరచారు. మిస్సోరీ స్థావరం నుంచి మొదలైన ఈ మిషన్‌.. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత చేపట్టిన అతి సుదూరమైన బీ2 మిషన్‌ ఇదేనని కెయిన్‌ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌లోని పలు స్థావరాలపై డజన్ల కొద్ది తొమాహాక్‌ క్షిపణులను ప్రయోగించామన్నారు.
మిస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్‌..
ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్‌ క్షిపణి దాడులతో విరుచుకుపడిరది అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకు టెహ్రాన్‌ ఈ విధంగా స్పందించింది.ఈ దాడులను ఐడీఎఫ్‌ కూడా ధ్రువీకరించింది. ఇరాన్‌ క్షిపణులు తమ దేశంపైకి దూసుకొస్తున్నాయని ఐడీఎఫ్‌ పేర్కొంది. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడిరచింది. అలా చేయకపోతే మా దాడులు మరింత తీవ్రంగా ఉంటాయి.. ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు ఈ దాడులతో టెల్‌ అవీవ్‌, జెరూసలెంతో సహా పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తన ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్షిపణులు దూసుకొస్తున్నందున పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, తదుపరి ఆదేశం వరకు అక్కడే ఉండాలని పేర్కొంది. దాదాపు 30 బాలిస్టిక్‌ క్షిపణలతో ఇరాన్‌ దాడి చేయగా అవి దేశవ్యాప్తంగా పది చోట్ల పడ్డాయి. ఈ దాడుల్లో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది.ఓడ రేవు నగరం హైఫాతో పాటు నెస్‌ జియోనా, రిషాన్‌ లెజియన్‌, టెల్‌ అవీవ్‌ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా చెబుతోంది. ఈ ఘటనల్లో 16 మంది గాయపడినట్లు తెలుస్తోంది. టెల్‌ అవీవ్‌పై తొలిసారిగా ఖైబర్‌ షేకాన్స్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించామని ఇరాన్‌ దళాలు పేర్కొన్నాయి. బన్‌ గురియన్‌ విమానాశ్రయం, బయోలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సహా వివిధ కమాండ్‌ కంట్రోల్స్‌ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపింది.ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ విమానాశ్రయాల అథారిటీ ఓ ప్రకటన జారీ చేసింది. టెల్‌ అవీవ్‌కు చెందిన వివిధ విమానాయాన సంస్థలు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. క్షిపణి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
అమెరికాలో పలుచోట్ల హైఅలర్ట్‌
ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం పలు నగరాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడిరది. దీనికి ప్రతిగా టెహ్రాన్‌ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్‌తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇరాన్‌లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్‌ పోలీస్‌ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లాస్‌ఏంజెలెస్‌ మేయర్‌ కరన్‌ బాస్‌ కూడా ఇలాంటి ఓ ప్రకటన చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా భద్రతకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ప్రార్థనా స్థలాలు, జనసమూహ ప్రాంతాలతో సహా ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచినట్లు పేర్కొన్నారు. మెట్రోపాలిటన్‌ పోలీస్‌ అధికారులు కూడా కొలంబియాలో ఎలాంటి ఘటనలు జరగకుండా మందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తాజావార్తలు