ఇవిఎంలపై అనుమానాలున్నాయి: శివసేన

ముంబై,మే31(జ‌నం సాక్షి):మహారాష్ట్రలోని పాల్గడ్‌ లోక్‌ స భ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై  శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని, దాదాపు 50వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల కమిషన్‌ పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత ఈసీ ఓటింగ్‌ శాతాన్ని తగ్గించిందన్నారు. అయితే తొలిసారి పాల్గడ్‌ స్థానం నుంచి ఒంటరిగా పోటీ చేశామని, అయినప్పటికీ.. గణనీయమైన ఓట్ల శాతాన్ని  సాధించినట్లు సంజయ్‌ రౌత్‌ చెప్పారు.