ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల చేసిన బొత్స

వ్యవసాయ విభాగంలో 95.03 శాతం
ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం ఉత్తీర్ణత

విజయవాడ,జూలై26(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్‌ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్‌ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు. జెఎన్‌టియు అనంతపురం ద్వారా ఇంజనీరింగ్‌, ఫార్మసీ మరియు అగ్రికల్చర్‌ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్‌, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 87,744మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ నిర్వహించారు.
ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈసారి ఇంజినీరింగ్‌, అగ్రి, ఫార్మా ప్రవేశాలకు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ లేదు. ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రవేశాలు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా 35శాతం సీట్లు ఈసారి ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.