ఈటెల రాజేందర్ గారిని పరమార్శించిన బీమని విజయ లక్ష్మి

 శేరిలింగంపల్లి సెప్టెంబర్ 2 ( జనంసాక్షి) బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ గారి తండ్రి శ్రీ ఈటల మల్లయ్య గారు గత నెల స్వర్గస్తులైనరు, దీనితో ఈటెల రాజేందర్ కుటుంబం లో పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది, ఈరోజు కమలాపురం లోని వారి స్వగృహం లో బీమని విజయ లక్ష్మి, సత్యనారాయణ గారు వారిని కలిసి పరమార్శించి, మల్లయ్య గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం ఏర్పాటు చేసిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.