ఈనెల 25న నిరుద్యోగ యువతకు జాబ్ మేళా : ఎంప్లాయిమెంట్ అధికారిణి డా॥ ప్రియాంక

జోగుళాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) : జూలై 23 : జిల్లాలోని నిరుద్యోగ యువతకు కర్నూల్,గద్వాలలోని వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనిలో శిక్షణ, ఉపాధి కల్పించుటకు, జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో బి.సి స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 25 న ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుందని .ఇట్టి జాబ్ మేళాలో పాల్గొను నిరుద్యోగులు 18 నుండి 35 సం॥ రాల వయస్సు తో పాటు SSC/INTER/DEGREE/ITI విద్యార్హత కలిగిఉండాలని కావునా ఇట్టి జాబ్ మేళాక. అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలు, ఆధార్ కాపీతో రావలెనని .
తద్వారా జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన నిరుద్యోగులకు శిక్షణ అనంతరం కర్నూల్ , గద్వాల లలోని వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందని కావున ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి డా॥ ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.