ఈనెల 6 ,13 తేదీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదు లింగాల ఘణపురం, జూన్04(జనంసాక్షి):

ఈనెల 6, 13తేదీ లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలియజేశారు.మూడో తేదీ నుండి 18వ తేదీ వరకు ఐదో విడత పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి  కార్యక్రమాలలో అధికారులు పాల్గొంటున్నందున ప్రజావాణి కార్యక్రమం 6, 13 తేదీలలో మాత్రమే జరగదని, తదుపరి ప్రజావాణి కార్యక్రమాన్ని 20వ తేదీ నుండి యధా ప్రకారంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.