ఈ నెల14 ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ రాక.
కేసీఆర్ చేతులమీదుగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం.
జిల్లా కలెక్టర్ నిఖిల.
వికారాబాద్ అగస్టు (జనంసాక్షి)రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 14న వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల ఆర్డీవోలు, తహసిల్దార్లు , వివిధ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ పట్టణ పరిసరాల్లో పారిశుధ్యం, ప్లాంటేషన్ , రోడ్ల మరమ్మత్తులకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు ఎవరూ కూడా సెలవుల్లో వెళ్లకూడదని, తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు, మీడియాకు సంబంధించి ప్రత్యేకమైన భారీ కేడ్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో ఏ ఎన్ ఎం లు , ఆశ వర్కర్లు, అంబులెన్స్ తో పాటు అత్యవసరం మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారికి తెలిపారు. రోడ్లమీద నీరు నిలవకుండా చిప్స్ వేయాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక వానాలు, బుల్లెట్స్ ను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అంతకుముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రా రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి , కొప్పుల మహేష్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ నిఖిల కార్యాల ప్రాంగణాన్ని, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
