ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి ఘన నివాళులు

టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): దివంగత నేత మాజీ ప్రధాని ఉక్కు మహిళ భారతరత్న గ్రహీత స్వర్గీయ ఇందిరా గాంధీ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో వేరువేరుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరా గాంధీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారు తలపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు బ్యాంకులు జాతీయం చేయడం గుర్తు చేసుకోవడంతో పాటు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు భూక్య దేవా నాయక్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన వారిలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రాస మల్ల నరసయ్య, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు బానోత్ సరిలాల్, కాంగ్రెస్ నాయకులు
భూక్యా రవీందర్ సింగ్, పూనెం లవ్ కుమార్, భూక్యా ధర్మనాయక్, మూడు సంజయ్, మూడు గణేష్, బానోత్ నరేష్,మీసాల ఆగయ్య, కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో కోరం సురేంద్ర ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన వారిలో మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్డి నాయక్, మాజీ పిఎసిఎస్ బేతంపూడి సొసైటీ అధ్యక్షులు వాంకుడోటు పుణ్య నాయక్,నర్సింగ్ లక్ష్మయ్య, బోడ మంగీలాల్ నాయక్, గడ్డం మధు రెడ్డి, ఈది గణేష్, బానోతు రవి,మూడు గణేష్తదితరులు పాల్గొన్నారు.