ఉచిత శిక్షణకు దరఖాస్తుకు గడువు పొడిగింపు.

వనపర్తి:- జూన్ 14 (జనం సాక్షి) గ్రూప్ ,డీఎస్సీ మరియు గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువును 20 .6 .2022 వరకు పొడిగించినట్లు బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల జిల్లా డైరెక్టర్ టీ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు ఉద్యోగాల నోటిఫికేషన్ లకు సంబంధించిన గ్రూప్ 2, 3, 4 మరియు డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు ఆసక్తిగల జోగులాంబ గద్వాల జిల్లా మరియు జిల్లాలకు చెందిన ఇంటర్ డిగ్రీ బిఈడి పోస్ట్ గ్రాడ్యూవెట్ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు తమ స్టడీ సర్టిఫికెట్ లతో నేరుగా గద్వాల పట్టణంలో గల బీసీ స్టడీ సర్కిల్లో జూన్ 20  తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు వివరాలకు గద్వాల లోని మొదటి రైల్వే గేటు దగ్గర గల టి టి ఎస్ గద్వాల పాత ఎల్ఐసి ఆఫీస్ నందు గల బీసీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలని కోరారు.