ఉత్తముడికి ఉత్తమ సన్మానం

– యూత్ నేత కాడెం ప్రశాంత్
డోర్నకల్ ఆగస్టు 26 జనం సాక్షి
ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మండల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎంపీపీ బాలు నాయక్ ను ప్రభుత్వం గుర్తించి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న ఉత్తమ ఎంపీపీ అవార్డు అందజేసింది.ఈ క్రమంలో తెరాస యువజన నేత కాడెం ప్రశాంత్ బీసీ సెల్ మండల నాయకులు గుండా వెంకన్నతో కలిసి ఎంపీపీని ఆయన చాంబర్ లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… జిల్లాలోనే ఉత్తమ ఎంపీపీగా డి.ఎస్ బాలు నాయక్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.ఉత్తముడికి ఉత్తమ అవార్డు దక్కిందన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే రెడ్యానాయక్,యువజన నాయకులు రవిచంద్ర సూచనలతో మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని బాలు నాయక్ ను కోరారు.