ఇది రైతు పక్షపాత ప్రభుత్వం
` నీటిపారుదల రంగానికి పెద్దపీట
` రూ.23,373 కోట్ల కేటాయింపుతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం
` సంక్షేమరంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు
` పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు
` మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):కాంగ్రెస్ ప్రభుత్వం రైతుపక్షపాతి అని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.రైతాంగం అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి రూపొందించిన బడ్జెట్ ఇదని ఆయన అభివర్ణించారు బుదవారం రాష్ట్ర శాసనసభలో ఆర్థిక,విద్యుత్ శాఖామంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు బడ్జెట్ ప్రసంగం పై ఆయన ఒక ప్రకటనలో స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సాదికారత, ఆహార భద్రత,స్థిరమైన అభివృద్ధి లతో పాటు నీటిపారుదల, పౌర సరఫరాలను పతిష్టవంతంగా మార్చేందుకు ఈ బడ్జెట్ ప్రతిబింబింప చేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీకి రైతాంగంపై మక్కువ ఎక్కువ అని చెప్పడానికి నీటి పారుదల రంగానికి 23 వేల 373 కోట్ల కేటాయింపు నిదర్శనమన్నారు. నల్గొండ జిల్లాలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు గాను ఉదయ సముద్రం నుండి బ్రహ్మాణ వెళ్ళేంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను పూర్తి చేయడంతో పాటు నల్లగొండ, యాదాద్రి భోనగిరి జిల్లాలోని 107 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు ఫ్లోరోసిస్ రహిత త్రాగు నీరు అందించే ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తామన్నారు అంతే గాకుండా మూసి ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోనీ బునాదిగాని కాలువ పునరుద్ధరణ కోసం 266.65 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ తద్వారా యాదాద్రి జిల్లాలో పంటలు సస్యశ్యామలంగా మారనున్నాయన్నారు కృష్ణా గోదావరి నదుల నీటి వాటాను తెలంగాణాకు సాదించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూనే బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన అక్రమ కేటాయింపులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యహారిస్తూనే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర హక్కులను బలంగా వాదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు నీటి వనరుల వినియోగాన్ని గుర్తించేందుకు వీలుగా టెలిమెట్రి పరికరాలను అమర్చడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తునే దీని ద్వారా నీటి కేటాయింపులలో పారదర్శకంగా ఉండొచ్చన్నారు నీటిపారుదల రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైతాంగానికి వెన్ను దన్నుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో సంక్షేమ రంగానికి సైతం బడ్జెట్ కేటాయింపులలో సముచిత స్థానం వేసి ప్రజల సంక్షేమం పట్ల తమకున్న చిత్తశుద్దిని చాటుకుందన్నారు.అందులో ముఖ్యంగా పేద ప్రజలకు నేరుగా కనెక్టివిటీ ఉన్న పౌర సరఫరాల శాఖకు ఏకంగా 5,734 కోట్లు కేటాయించడం మహాదానందంగా ఉందన్నారు.తద్వారా లక్షలాది కుటుంబాలకు ఆహార భద్రత కల్పించినట్లైందన్నారుఅంతే గాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విదంగా గృహజ్యోతి పధకంలో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు 1,775.15 కోట్లు కేటాయింపు ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమన్నారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పధకంలో భాగంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 22,500 కేటాయించిన ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న మక్కువను చాటుకుందన్నారు.అభయహస్తం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్ ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద 500 కే గ్యాస్ సిలిండర్ లతో పాటు కొత్తగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు ఆర్థికంగా బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారుఅన్నింటికీ మించి సన్నాల ప్రోత్సాహనికి గాను ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ అద్భుతమైన ఫలితాలు నమోదు చేసిందన్నారు.బోనస్ ప్రకటనతో సన్నాల సాగు 25 లక్షల నుండి 40 లక్షలకు చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత గా ఆయన అభివర్ణించారురైతుభరోసా పథకం క్రింద రైతాంగానికి ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 అందించేందుకు గాను బడ్జెట్ లో 18,000 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతిస్తూ తద్వారా రైతాంగం ఆర్థిక స్థిరత్వం సాధించడంతో పాటు ధాన్యం దిగుబడి పెరిగేందుకు దోహదపడుతుందన్నారు.సామాజిక న్యాయానికి సహజంగానే కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండడాన్ని ఆయన బలంగా సమర్దించారు.దళిత సంక్షేమానికి 40,232 కోట్లు,గిరిజన సంక్షేమానికి 17,169 కోట్లు,బి. సి సంక్షేమానికి 11,405 కోట్లు,గ్రామీణాభివృద్ధికీ 31,605 కోట్లు,ప్రజా ఆరోగ్యానికి12,393 కోట్లు,మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మొత్తంగా 3.04 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన విజనరీ రోడ్ మ్యాప్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.