ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహితులకు గోపా ఆధ్వర్యంలో సన్మానం

జనం సాక్షి: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో గోపా నర్సంపేట్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఇందులో శ్రీ దుప్పటి కృష్ణమూర్తి గౌడ్, జూలూరి పురుషోత్తం గౌడ్, పోశాల కళ్యాణి గౌడ్, జూలూరి శ్రావణి గౌడ్, గార్లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి వరంగల్ జిల్లా గోపా అసోసియేషన్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మన జాతి ముద్దు బిడ్డలు, జాతి నిర్మాతలు అను కొనియాడారు, వరంగల్ జిల్లా గోపా ప్రధాన కార్యదర్శి బొమ్మల కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల నిరంతర అభివృద్ధికి వారి భవిష్యత్తుకు ఉపాధ్యాయులే ముఖ్య కారణం అని అన్నారు,గోపాను మండల స్థాయిలో బలోపేతం చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా గోపా కోశాధికారి, అనంతుల రమేష్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ, ప్రకాష్, సోల్తి సారయ్య, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గొడిశాల సదానందం, మాచర్ల ఐలమల్ల గౌడ్, మాచర్ల రమేష్ గౌడ్, ఇలా పరుపు నరేందర్ గౌడ్, వల్లాల అంకుష్ గౌడ్, తాళ్ల పెళ్లి నవీన్ గౌడ్, గొడిశాల చంద్రమౌళి గౌడ్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.