ఉద్యమకారులను ఆదుకోవాలి…

ఉద్యమకారుడు సాగర్
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 5
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి, ఉద్యమకారుల కుటుంబాల ఆదుకోవాలని ఉద్యమకారుడు కన కం సాగర్ ప్రభుత్వాన్ని సోమవారం కోరారు. సాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుండి ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల కుటుంబాలు పూట గడవక నాన్న అవస్థలు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి అందించి అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఉద్యమకారుల ను గుర్తించి వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఉద్యమకారుల సంక్షేమాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు విడుదల చేసి ఉద్యమకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు పోస్ట్ కార్డు ద్వారా తన విన్నపాన్ని అందజేసినట్లు వెల్లడించారు