ఉద్యోగ సృష్టికర్తలుగా దేశ యువత

ా గ్రామాల్లోనూ నేడు స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమవుతున్నాయి
ా ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): నేటితరం యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశవ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. స్టార్టప్‌లు పెద్ద పెద్ద నగరాలకే పరిమితం కాదని, దేశమంతటా విస్తరిస్తున్నాయని అన్నారు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ నేడు స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమవుతున్నాయని మోదీ చెప్పారు. వ్యాపారానికి అవసరమైన నిధులు, చేయగలమన్న ధైర్యం, ప్రజలతో మమేకమయ్యే తీరు స్టార్టప్‌లలో రాణించేందుకు దోహదపడుతాయని తెలిపారు. మేకిన్‌ ఇండియా, డిజిల్‌ ఇండియా కూడా స్టార్టప్‌లకు ముఖ్యమేనన్నారు.ఒకప్పుడు స్టార్టప్‌ కంపెనీలు అంటే డిజిటల్‌, టెక్నాలజీకి సంబంధించినవే ఉండేవి. కానీ ఇప్పుడు అది మారుతోందన్నారు. వ్యవసాయం దగ్గర్నుంచి అన్ని రంగాల్లోనూ స్టార్టప్‌లు వస్తున్నాయని, యువత వ్యాపారాల్లోకి వచ్చేందుకు ప్రభుత్వం అనివిధాలా సాయం చేస్తోందన్నారు. నిబంధనలను కూడా సరళించి స్టార్టప్‌లకు నిధులు అందిస్తున్నామని, నేటి పెద్దపెద్ద కంపెనీలు అన్నీ ఒకప్పుడు స్టార్టప్‌లేనన్నారు. అందుకే నేను కోరుతున్నది ఒకటే.. భారత ప్రజలు ఎప్పుడూ సృజనాత్మకంగా ఉండాలి’ అని మోదీ అన్నారు. ఇందుకోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కింద రూ.10 వేల కోట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.