ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి లేనిచో కఠిన చర్యలు తప్పవు

మల్దకల్ జూలై 22 (జనంసాక్షి) మల్దకల్ మండల పరిధిలోని నేతవానిపల్లి తండా, నేతవానిపల్లి,మంగంపేట, పాఠశాలలనుశుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కొండారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో ఉపాధ్యాయ హాజరు పట్టికలను,భూమికా2 యాక్షన్ ప్లాన్ ,టీచర్స్ డైరీలను పరిశీలించడం జరిగింది. మెనూ ప్రకారంగా మధ్యాహనభోజనం వడ్డించాలని ఆదేశించడం జరిగింది.ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించాలని ఎంఈఓ ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని,ఎవరైతే సమయపాలన పాటించినచో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.నేతవానిపల్లి పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణి చేశారు.