ఉపాధ్యాయు సమస్యల పరిష్కారం పిఆర్ టియూ తోనే సాధ్యం.

పిఆర్ టియూ జిల్లా అధ్యక్షుడు సూర్య శ్రీనివాస్ గౌడ్.
పిఆర్టియూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్20(జనంసాక్షి):

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కేవలం పిఆర్ టియూ తోనే సాధ్యం అవుతుందని పిఆర్ టియూ జిల్లా అధ్యక్షుడు సూర్య శ్రీనివాస్ గౌడ్,పత్రికా సంపాదకులు  దొడ్ల సత్యనారాయణ రెడ్డి అన్నారు.తాడూర్ మండలంలో పిఆర్ టియూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సూర్య శ్రీనివాస్ గౌడ్, దొడ్ల సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పిఆర్ టియూ సంఘం నిరంతరం  కృషి చేస్తుందని అన్నారు.ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పిఆర్ టియూ తాడూర్ మండల అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర బాధ్యులు  పాలమూరు శ్రీనివాసులు వాస రాఘవేందర్ ,జిల్లా భాద్యులు గణేష్, ప్రమోద్ , త్యాగ రాజుగామ జగదీశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు బాబు రావు పాల్గొన్నారు.