ఉప్పరపల్లిలో కరపత్రాల కలకలం….

కేసముద్రం సెప్టెంబర్ 7 జనం సాక్షి / మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు విడుదల చేసి కలకలం సృష్టించారు…వివరాల్లోకి వెళితే…స్థానికంగా రేషన్ డీలర్లు,అధికారులు కుమ్మక్కయి సన్న రకం బియ్యం బదులు దొడ్డు రకం బియ్యం పంపిణీ చేస్తున్నారని,తూకం లో కూడా మోసం ఉందని, పట్టించుకోని గ్రామ పాలక వ్యవస్థ అని కరపత్రాలు విడుదల చేసి పలువురిని ఆలోచింప చేశారు.ఈ కరపత్రాలు చదివిన స్థానికులు ఇది నిజమే కదా అని గుసగుసలాడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.