*ఎందరికో ఆదర్శ ప్రాయుడు సీనియర్ టీఆర్ఎస్ నేత క్రీ.శే.దూదిగాని గురువయ్య*

కొడకండ్ల,సెప్టెంబర్09(జనం సాక్షి):జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మెట్రో ఈవినింగ్స్ జర్నలిస్ట్ దూదిగాని నాగరాజు తండ్రి కురు వృద్ధుడు టీఆర్ఎస్ సీనియర్ నేత దూదిగాని గురువయ్య రజక గురువారం రోజున అనారోగ్య కారణంగా పరమపదించారు. ఆయన సీనియర్ రాజకీయ నేతలు కుందూరు మధుసూదన్ రెడ్డి సమకాలీకులతో రాజకీయ రంగంలో వారితో తిరుగుతూ రజకులలో చైతన్యం నింపిన చిరస్మరనీయుడు గురువయ్య. అంతేకాకుండా కొడకండ్ల మండలంనకే కాకుండా చుట్టూ ప్రక్కల మండలాలకు బ్యాండును పరిచయం చేసిన తొలి ఆద్యుడు. రాష్ట్రం నలుమూలల నుండి బ్యాండులో ప్రావీణ్యం పొందిన మాస్టర్ల  నేతృత్వంలో తన సొంత ఖర్చులతో బ్యాండును విస్తరించాడు. అంతేకాకుండా తాను వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన పనులలో ఎందరికో మార్గాన్ని చూపి మార్గదర్శి అయ్యాడు.కుల,మత బేధం లేకుండా తన ఇంట్లో చాలా మందికి  ఆశ్రయం ఇచ్చి ఉన్నత  విద్యాభ్యాసానికి పాటుబడ్డాడు.తన స్వార్థం కోసం చూసుకోకుండా ఎంతో మంది అభివృద్ధి చెందడానికి కారకుడయ్యాడు.తనకున్న 10 మంది సంతానంలో కొందరిని  ఉన్నత విద్య అభ్యసించేలా కృషి చేశాడు.కానీ తన స్వార్థం కోసం ఏ ఒక్క వ్యక్తిని గాని,నమ్ముకున్న పార్టీని మోసం చేయకుండా నీతి,నిజాయితీలతో ఎవరి మీద ఆధారపడకుండా కాలం వెళ్ల దీసిన ధైర్యశాలి అతను.