ఎద్దులగూడెంలో నిరుపయోగంగా ఉన్న వంటగది

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) మండల పరిధిలోని ఎద్దులగూడెంప్రాథమిక పాఠశాలలో వంటగది నిరుపయోగంగా ఉన్నది. మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో విద్యార్థులు30 మంది విద్యార్థుల కంటే తక్కువనే ఉన్నారు. విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనము వంట ఏజెన్సీ వారు పాఠశాల వంటగదిల్లో వండకుండగా ఇంటిదగ్గర మధ్యాహ్నం భోజనము వండుకొని వచ్చి విద్యార్థులకు పెడుతున్నారు. వంటగదులు లేక చాలా పాఠశాలలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరోవైపు వంటగదులు ఉండి వంట చేయకుండా పాఠశాలలో నిరుపయోగంగా వంట గదులు ఉన్నాయి.ప్రభుత్వము వేలాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తుంటే వాటిని వినియోగంలోకి తేవాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులువెంటనే స్పందించి వంట గదిలో మధ్యాహ్న భోజనము పాఠశాలలోని వండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.