ఎనిమిదేళ్ల మోడీ పాలన సుపరిపాలన -అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు -వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపి నాయకులు గంట రవికుమార్ గారు వరంగల్ ఈస్ట్, జూన్ 11(జనం సాక్షి):

వినూత్న పథకాలను అమలు చేస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని మోడీ అభివృద్ధి పరుస్తున్నాడని బీజేపీ నేత గంట రవికుమార్ అన్నారు. ఈరోజు  ఖిలావరంగల్ లోని మైదానం లో ఉదయం వాకర్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం వాకర్స్, వాహనదారులు, ఇంటింటికి వెళ్లి కేంద్రం సాధించిన అభివృద్ధి పై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ మేరకు గంట రవికుమార్ మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీ నాయకత్వంలో ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టి కేవలం 8 ఏళ్ల లోనే దేశాన్ని అభివృద్ధి లో ప్రపంచ పటంలో ముందు వరుసలో నిలిపారని, సుపరిపాలన అందించిన ఏకైక ప్రధాని గా మోడీ నిలిచారన్నారు. గరీబ్  కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు  అందించిన ఘనత మోడీ దని అన్నారు. పీఎంఆర్వై కింద పల్లె,పట్టణాల్లో 3.50కోట్ల ఇళ్లను మంజూరు చేశారని గంట రవికుమార్ పేర్కొన్నా రు.
రాష్టం లో కేసీఆర్ పాలన మరోలా ఉందని మండిపడ్డారు. 2014 లో రూ.60 వేల అప్పు ఉంటే ఇప్పుడు రూ.5లక్షలకు చేరిందని, ఇది కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం అని రవికుమార్ ఎద్దేవా చేశారు. రూ.3,500 కోట్లు ఉన్న ఆదాయాన్ని ఏకంగా రూ.37వేల కోట్లకు పెంచి.. రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచుతోందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీదర్ గారు పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా ప్రదాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాద్యాక్షులు కనుకుంట్ల రంజిత్ , పిట్టల కిరణ్ , యువమొర్చ అద్యక్షులు కొప్పుల క్రాంతి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆడెపు వెంకటేష్, వరంగల్ తూర్పు నాయకులు కుసుమ సతీష్, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్ , పుప్పల రాజేందర్ , అంకాల జనార్ధన్, వరంగల్ జిల్లా ప్రచార కార్యదర్శి బైరి శ్యాం సుందర్, వరంగల్ జిల్లా ఓబిసి మోర్చా ఉపాద్యాక్షులు సతీష్ పోశాల, వరంగల్ తూర్పు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్, SC మోర్చా రాష్ట నాయకులు మాదాసి రాజు, 36 38 డివిజన్ అద్యక్షులు పుప్పాల శ్రీనివాస్, ఎల్లబొయిన చంద్ర మోహన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు