ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం

తల్లిపై దాడి చేసి హత్య
విజయవాడ,జూలై30 ( జనంసాక్షి):  సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. పున్నామా నరకం
నుంచి రక్షించాల్సిన కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి చంపుతున్నారు. తాజాగా మానసిక స్థితి సరిగాలేని ఓ కుమారుడు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగింది.
మానసిక స్థితి బాగాలేని కొడుకు తల్లితో గొడవపడ్డాడు. ఆ సమయంలోనే విచక్షణ కోల్పోయి దాడి చేశాడు.
తిరువూరు మండలం ఎరుకుపాడుకు చెందిన చింతల నాగేంద్రబాబుకు మతిస్థిమితం సరిగా లేదు. తల్లి మంగమ్మతో గొడవపడిన అతను.. పారతో కొట్టి, గొంతు నులిమి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరూవురు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.