ఎపిలో మహిళా ఉద్యోగులకు సెలవులు పెంపు

60 నుంచి 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు
ఇద్దరు పిల్లలున్న తల్లులకే వర్తిస్తుందని షరతులు
అమరావతి,మార్చి9(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవును పొడిగించింది. అయితే ఇద్దరు పిల్లలున్న వారికి మాత్రమే పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. పిల్లల సంరక్షణకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 60 రోజుల సెలవు దినాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ సెలవు దినాన్ని 180 రోజులకు పెంచుతూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇద్దరి లోపు పిల్లలు ఉన్నవారికే ఈ అవకాశం ఉంటుందని వివరించారు.
ఇదే కాకుండా ఏడాది లోపు వయసు ఉన్న వారిని దత్తత తీసుకున్నప్పుడు కూడా సెలవు వర్తిస్తుందని, పురుష ఉద్యోగులకూ 15 రోజులు పెటెర్నిటీ లీవ్స్‌ ఇస్తామని చెప్పారు. పెళ్లి చేసుకోని పురుషులు, భార్య మరణించిన వారికి, విడాకులు తీసుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుందన్నారు. సెలవు కాలానికి జీతం వస్తుందని వెల్లడిరచారు. దత్తత తీసుకునే పిల్లల వయసు నెలరోజుల లోపు ఉంటే ఆ సెలవు ఏడాది పాటు, ఆరు నుంచి ఏడు నెలల మధ్య వారయితే ఆరు నెలలు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించామని ఆయన తెలిపారు. పిల్లల సంరక్షణకు తీసుకునే సెలవు, తమ ఉద్యోగ కాలం మొత్తం విూద 180 రోజుల పాటు మహిళా ఉద్యోగులు తీసుకోవచ్చని పేర్కొంది. క్షయ, క్యాన్సర్‌, కుష్టు, కిడ్నీ వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవు మంజూరు చేయడంతో పాటు ఆ సమయంలో ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా పెంచామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.