ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళల నిరసన..

ఇల్లందు నవంబర్ 30 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ గురువారం రోజు కొందరు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కొందరు వార్డు కౌన్సిలర్లు తమకు అనుకూలంగా ఉన్న వారికే పైసల పంపిణీ కార్యక్రమం చేశారని ఆరోపించారు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం లో ఆంతర్యం ఏమిటి అని వారిని నిలదీయగా మాకు పైనుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి మేము పంపిణీ చేసాము మాకు తెలియదు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పైవారిని అడగండి అని కొందరు వార్డు కౌన్సిలర్లు అబాధ్యత రహితంగా వ్యవహరించడమే కాకుండా మా మాట లెక్కచేయకుండా మమ్ములను చులకనగా చూశారని ఎమ్మెల్యేకి వినతి చేసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.