ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో టిఆర్ఎస్ లోకి చేరికలు

నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్ల వీరయ్య పల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి కుస రాజు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పెండ్లి రమేష్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పెద్ది టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ని రైతులకు కెసిఆర్ అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, స్థానిక సర్పంచ్ అమరేందర్, టిఆర్ఎస్ మండల నాయకులు తేజావత్ సమ్మయ్య నాయక్, మామిండ్ల మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శంకర్ ,సాంబయ్య, రవి, బుచ్చిరెడ్డి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.