ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దిష్టి బొమ్మ ను దగ్దం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.

అచ్చంపేట ఆర్సి   జూలై (జనం సాక్షి న్యూస్). స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు  ఇటీవలె ఓ సమావేశంలో మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పైన అనుచిత వ్యాఖ్యల కు  నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు సోమవారం నాడు స్థానిక పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా  పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని, మీకు చేతనైతే అచ్చంపేట నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చేసి చూపించాలి కానీ మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పైన పైన స్థానిక ఎమ్మెల్యే నిరాధారమైన ఆరోపణలు  అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు .ఈ మధ్యకాలంలో నిర్వహించిన వరంగల్ రైతు డిక్లరేషన్ సభ తో , రచ్చబండ కార్యక్రమం తో ప్రజల నుంచి  రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక మతిభ్రమించి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఇది సరైన పద్ధతి కాదని వెంటనే క్షమాపణ చెప్పాలని,లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరీ శంకర్, కటకం రఘురాం, మద్దెల రామనాథం ,ఖాజా , దాశరథి పవన్ కుమార్ ,సుశీల తదితరులు పాల్గొన్నారు.