ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో వార్డుల అభివృద్ధి.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు అగస్టు 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సీ.సీ.ఐ కాలనీ 24వ వార్డులో ఎమ్మెల్యేరోహిత్ రెడ్డి ప్రత్యేక నిధులు (సీ.డీ.పీ గ్రాంట్స్) నుండి 8లక్షల రూపాయిల వెయ్యంతో సి.సి రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్.పట్లోళ్ల దీప నర్సింలు ప్రారంభించా రు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ఎమ్మెల్యే రోహితన్న ప్రధానలక్ష్యమని,అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఆదర్శ నియోజకవర్గంగా తాండూరును తీర్చిదిద్దుతు ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.రోడ్డు నిర్మాణ పనులతో కాలనీ వాసులకు ఎంతో ఉపశమనం కలుగానున్నదని, రోడ్డు పనుల నాణ్యతలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీతా ఠాకూర్ ,సాహు శ్రీలతా,మంకల రాఘవేందర్,ముక్తర్ నాజ్,ప్రభాకర్ గౌడ్,బలప్ప నాయకులు రాజు(నర్సీ రెడ్డి),ప్రవీణ్ పటేల్,సుమిత్ గౌడ్,బస్వరాజ్,సంతోష్ గౌడ్,రవి తదితరులు పాల్గొన్నారు.