ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం

మాట్లాడే ముందు తమ స్థాయిని తెలుసుకోని మాట్లాడండి

విలేకరుల సమావేశంలో బంగారి వెంకటేష్

జనం సాక్షి జడ్చర్ల అక్టోబర్ 29:

జడ్చర్ల శాసనసభ్యులు, తమ నాయకుడు లక్ష్మారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, ఒకరిని విమర్శించే ముందు తమ స్థాయి ఏమిటో తెలుసుకోని మాట్లాడండని రాజపూర్ మండల భారత రాష్ట్ర సమితి యూత్ అధ్యక్షులు బంగారు వెంకటేష్ పేర్కొన్నారు.

జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న అభివృద్ధి ప్రధాతను విమర్శిస్తే పరిణామాలు తీవ్రతరం ఉంటాయని, మీలాగా మేము విమర్శించలేమా.. మా నాయకుడు మాకు అలాంటివి నేర్పలేదని క్రమశిక్షణతో మెలుగుతున్నామని, అభివృద్ధిని కోరుకోవాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మున్ముందు తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు.

ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవాదళ్ మండలాధ్యక్షులు సున్నపు శ్రీనివాసులు, బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు జనిగల శేఖర్,బిఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, నరసింహ నాయక్, నవీన్, మల్లెపాగ లక్ష్మయ్య, భాస్కర్ నాయక్, సభావట్ రాజు తదితరులు పాల్గొన్నారు.