ఎలాంటి రభస జరగలేదు – కేజ్రీ వర్గం..

oy8tjic9ఢిల్లీ : ఆప్ నుండి బహిష్కృతమైన నేతలు..కేజ్రీవాల్ వర్గం మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆప్ నేతలు యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ కుమార్, అజీజ్ ఝూలకు పార్టీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అనంతరం తమను గూండాయిజంతో బయటకు గెంటేశారని యోగేంద్ర ఆరోపించారు. దీనిని కేజ్రీవాల్ వర్గం ఖండించింది. ఎలాంటి రభస జరగలేదని పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఆప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తాము చెప్పే మాటలను కూడా వారు వినకుండా బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొట్టారని యోగేంద్ర అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలు చూపుతామని స్పష్టం చేశారు. 352 మంది సభ్యులకు గాను 311 హాజరయ్యారని పేర్కొన్నారు.