ఎల్పీజీ రాయితీ మంగళం పాడేందుకు కేంద్రం అడుగులు.

ఢిల్లీ:ఎల్పీజీ రాయితీ వదులుకునే ప్రోత్సహక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరం. నగదు బదిలీతో వంటగ్యాస్ రాయితీలో లీకేజీని అరికట్టామని ప్రధాని తెలిపారు. 2.8 లక్షల మంది ఎల్పీజీ రాయితీ వదులుకున్నారు. ఎల్పీజీ రాయితీ వదులుకోవటం వల్ల రూ. 100 కోట్లు ఆదా అయ్యిందని పేర్కొన్నారు. మార్కెట్ ధరకు ఎల్పీజీ కొనే స్తోమత ఉన్న వాళ్లు రాయితీ వదులుకోవాలని కోరారు. నాలుగేళ్లలో కోటి కుటుంబాలకు పైపుల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్ ఇస్తామని ప్రధాని ప్రకటించారు.