ఎస్సీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ లకు లాటరీ ద్వారా ఎంపిక

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 21 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా నందు ఎస్సి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అదనపు సీట్ల కొరకు 1,5 వ తరగతుల ప్రవేశానికి లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హలునందు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృధి అధికారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 1, తరగతి ప్రవేశానికి 55 సీట్ల కు గాను 96 దరఖాస్తులు వచ్చాయనీ,5 వ తరగతికి 55 సీట్లకుగాను 124 మంది దరఖాస్తులు చేసుకున్నారని , మొత్తం నూట పది మందిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షెడ్యుల్డ్ కులాల అభివృధి అధికారి శ్వేత ప్రియదర్శిని ,డి ఈ ఓ సిరాజుద్దీన్ ,ఇ డి ఎస్సి కార్పొరేషన్ రమేష్ బాబు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.