ఎస్ ఆర్ తోట లో పట్టణ ప్రగతి  వరంగల్ ఈస్ట్ , జూన్ 7(జనం సాక్షి):

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగవ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వరంగల్ నగరంలోని 32 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి  పళ్లం పద్మ రవి  ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్లోని 16.1 బ్లాక్ లోని భగత్ సింగ్ నగర్, పుట్నాల మిల్లు ఏరియా జ్యోతి కాలనీ, సీతారామాంజనేయ  మిల్లు ఏరియా లోని ప్రజల మౌలిక సమస్యలను కాలనీలోని ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకొని వారి ద్వారా వచ్చిన సమస్యలు నూతన విద్యుత్ స్తంభాలు లైట్స్ సి సి రోడ్డు డ్రైనేజ్  ప్యాచ్ వర్క్ నీటి పైపులైన్లు లీకేజీలు పరిశీలించి మున్సిపాల్ సిబ్బంది తో కలసి నోట్ చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పద్మ రవి గారు కృషి చేస్తానని  ప్రజలకు హామీ ఇచ్చారు వీరి వెంట ఏఈ హబీబ్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ టిఆర్ఎస్ నాయకులు పొగాకు సందీప్ ,ఎరుకల మహేందర్ ,జవాన్ జీవన్ అంగన్వాడీ టీచర్స్ ఆర్ పి లు నాయకులు పాల్గొన్నారు.