ఏపీలో విద్యాసంస్థలకు శంకుస్థాపన

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఏపీలో కేంద్రం ఏర్పాటు చేయబోయే మూడు జాతీయ విద్యాసంస్థలకు ఒకేచోట శంకుస్థాపన చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మెర్లపాకలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ర్ట పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో కేంద్రం ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ర్ట మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.