ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్?

చాలా తొందరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోకి కొత్త ముఖాన్ని తీసుకుని వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఏపీకి చెందిన ఆర్ఎస్ఎస్‌ ప్రముఖుడు, బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారణాసి రాం మాధవ్ పేరు ఏపీ బీజేపీ చీఫ్ పదవికి వినిపిస్తోంది.