ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో ముగిసిన భారత్‌ పోరు

తైపి : తైపిలో జరుగుతున్న ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారుల ఆట ముగిసింది. భారత బ్యాడ్మింటన్‌ ఆశాజ్యోతి పివి సింధు మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడు గేమ్‌ల పాటు పోరాడి ఓడిపోయింది. ఏడో సీడ్‌ జపనీస్‌ క్రీడాకారిణి ఎరికో హిరోస్‌ చేతిలో 19-21,21-16,11-21 స్కోర్ల తేడాతో పరాజయం పాలైంది.