ఒక సంవత్సరం జైలు శిక్ష

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో గంగాధర్ గుడుంబా అమ్ముతున్నారని పట్టుకున్న సీఐ రాధా ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయగా సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నట్లు ఎమ్మార్వో తెలిపారని సిఐ రాధ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రాధ మాట్లాడుతూ 2012లో మొదటగా గుడుంబా అమ్ముతున్నారని బైండోవర్ చేసామని ఇంకోసారి ఇదేవిధంగా గుడుంబా విక్రయిస్తే లక్ష రూపాయలు జరిమానా లేదంటే సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నట్లు ఎమ్మార్వో తెలిపారు. ప్రస్తుతం గంగాధర్ అదేవిధంగా గ్రామంలో గుడుంబా విక్ర హించడంతో సిఐ రాధా గంగారం ను గుడుంబా అమ్ముతుండగా దొరకబడ్డారు. ఎమ్మార్వో ముందు బైండోవర్ చేస్తే ఒకసారి వదిలిపెట్టమని మళ్లీ ఇంకోసారి గుడుంబా విక్రయిస్తే జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించిన అలాగే విక్రహించడంతో లక్ష రూపాయలు కట్టమని నోటీసులు జారీ చేశారని గంగాధర్ డబ్బులు కట్టగా పోలీసుల తప్పించుకొని తిరుగుతున్నాడు సోమవారం రోజు గంగాధర్ను సిఐ రాధా అరెస్టు చేసి ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయగా ఎమ్మార్వో రాజేందర్ సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో కరీంనగర్ కారాగారంకు తరలించారు.