ఒబామాకు విషం పూసిన లేఖ పంపిన కేసులో ఒకరి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పాటు సెనెటర్‌ రోగర్‌ వికర్‌కు ‘రిసిన్‌’ అనే విషపదార్థాన్ని పూసిన లేఖ పంపిన కేసులో ఎఫ్‌బీఐ అధికారులు ఒకర్ని అరెస్టు చేశారు. వికర్‌ నివశిస్తున్న టుపీలో పట్టణం నిందుతుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిమజేస్తామని ఉన్నతాధికారులు వివరించారు.