ఓటమి భయంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు టికెట్ నాకు రాదని అసత్య ప్రచారం..!

– రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 :
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన మంథని నియోజకవర్గ స్థాయి మండల కమీటీ, మోర్చాల కమిటీ, శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశనికి ముఖ్య అతిధులుగా మైసూర్ ఎమ్మెల్సీ శశీల్ జీ నామోషీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మంథనిలో బిజెపి పార్టీ గెలుపు చరిత్ర సృష్టిస్తుందని, ఒక కొత్త వ్యక్తికి ప్రజల అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని , బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మన గెలుపు చెప్పపెట్టు కావాలని, దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రావాలని బంగారు తెలంగాణ బిజెపితోనే సాధ్యమని నరేంద్ర మోదీ విశ్వ గురువుగా మన దేశాన్ని తీర్చిదిద్దారని, అసత్య ప్రచారాలు నమ్మి కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని బిజెపి పార్టీలో కష్టపడిన వారికి ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని, మన గెలుపును చూసి ఓర్వలేక ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజల్లో ఒక ఆందోళన కలిగిస్తున్నారని కార్యకర్తలు నెలరోజుల కష్టపడి పని చేస్తే భవిష్యత్ తరాలకు మంచి జీవితాలను కల్పించిన వారు అవుతారని, మంథని ప్రాంతంలో మార్పుకు శ్రీకారం చుట్టి సునీల్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ..ఓటమి భయంతోనే కాంగ్రెస్ బి ఆర్ఎస్ తనకు టికెట్ రాదని అసత్య ప్రచారాలను చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. అన్ని పార్టీ లాగా బిజెపి పార్టీ స్వార్థంతో పనిచేయదని కష్టపడ్డ వారికి నికాస్ అయిన కార్యకర్తలకు అండగా ఉంటుందని, ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈరోజు మనకు వస్తున్న ఆదరణ, గెలుపు ఓర్వలేక ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ప్రతి ఒక కార్యకర్త దీన్ని తిప్పి కొట్టాలని ప్రజల ఆశీర్వాదంతో, నా అన్నదమ్ములు కార్యకర్తల కష్టంతో ఈసారి మంథనిలో బిజెపి జెండా ఎగరవేస్తామని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.