ఓయూలో తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మ బలిదానం

ఇవి సర్కారు హత్యలే : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమ ఖిల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరో విద్యార్థి ఆత్మబలిదానం చేసుకున్నాడు. మరో పాలమూరు బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బండారు శ్రీనివాస్‌ శనివారంఉస్మానియా వర్సిటీ లా కళాశాల వెనుక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావని, తెలంగాణ వస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయని, చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల దమనకాండతో కలతచెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన మరణమే ఉద్యమానికి ఆఖరిది కావాలని సూసైడ్‌ రాసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్‌ గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసి కాంపిటీటివ్‌ పరీక్షల కోసం క్యాంపస్‌లో ఉంటూ ప్రిపేర్‌ అవుతున్నాడు. శ్రీనివాస్‌ స్వస్థలం కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండ పల్లి మండలం గౌడిపల్లి గ్రామం. శ్రీనివాస్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న