నానో ఆలోచ‌న ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది

భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌ముఖ‌ల్లో ఒక‌రైన‌ దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా మృతిప‌ట్ల హృద‌య‌పూర్వ‌క నివాళులర్పిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్ర‌తి భార‌తీయ కుటుంబం కారును సొంతం చేసుకోవాల‌నే ఉద్దేశంతో.. నానో ఆలోచ‌న‌తో ర‌త‌న్ టాటా రావ‌డం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది అని పేర్కొన్నారు. విశ్వాసానికి, ప్ర‌పంచ ఆశ‌యాల‌కు మాత్ర‌మే టాటా గ్రూప్ ఆద‌ర్శం కాదు.. దాతృత్వానికి కూడా ఆద‌ర్శంగా టాటా గ్రూప్‌ను మార్చారని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కొనియాడారు. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ఆర్ఎస్పీ పేర్కొన్నారు.