కమలం గుర్తుకు ఓటేసి ఆదరించండి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి ఆదరించి, గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే భర్తీ దుర్గం అశోక్ కోరారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ సూపర్ బజార్ సెంటర్ బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజెపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
చెన్నూరు అభివృద్ధి తో పాటు, మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతూ, ప్రపంచానికే దిక్సూచిగా మారిందని ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్రం , చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బిజెపికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వందల కోట్లతో ప్రజలను డబ్బులతో కొనాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి. ఆరుముళ్ల పోశం, ఐటీ సెల్ సోషల్ మీడియా ఇన్చార్జి వేముల అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మాసుసత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు జి. కళాధర్ రెడ్డి, దండు రాజేందర్, జంగంపల్లి మల్లయ్య, పాల రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, సంతోష్ రామ్, బద్రి సతీష్, రవీందర్, నరసన్న, తదితరులు పాల్గొన్నారు.