కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ మోతిలాల్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 17(జనంసాక్షి):
జిల్లా అదనపు కలెక్టర్  యస్. మోతిలాల్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని  స్వీకరించారు.జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ ఈ రోజు మనందరికి పండుగ రోజు,ప్రపంచంలోనే గొప్ప సర్వ సత్తాక ప్రజాస్వామ్య దేశం భారతదేశం లో తెలంగాణ విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.రాజరిక పాలన నుండి ప్రజా పాలన దిశగా కల్పించేందుకు విముక్తి కోసం సాయుధ పోరాటాలు చేసిన తెలంగాణ పోరాట యోధులను ఆయన ఈ సందర్భంగా స్మరించకున్నారు.
అంతకుముందుజాతిపిత మహాత్మా గాంధీజీ, భారత రత్న డా.బి.ఆర్.అంబెడ్కర్ ల చిత్రపటాలకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సీతారాం, అనిల్ ప్రకాష్, భూపాల్ రెడ్డి, చంద్రశేఖర రావు, నర్సింగరావు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.