కలెక్టరేట్‌ ముట్టడితో ఉన్‌ఎద్రిక్తత

 

కర్నూలు,మార్చి9(జనం సాక్షి): కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం జరిగింది. బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. కావేరి పత్తి విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా.. పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది.