కస్తూర్బా బాలికలకు మాత్రాలను వేసిన ఎమ్మెల్యే

మల్దకల్ సెప్టెంబర్15(జనం సాక్షి)గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి విద్యార్థులకు ఉచిత నులిపురుగుల నిర్మూలన మాత్రలను గురువారం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసెప్టెంబర్ 15 న  జాతీయ నులిపురుగుల  దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధితోపాటు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం తరఫున కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు.ప్రతి పిల్లలకు శారీరక, మానసిక దృఢత్వంగా ఉండాలి,పోషకాహారం లోపం, రక్తహీనత తో అలసటగా ఉండటం ఇలాంటి సమస్యలు పిల్లలకు రాకుండా ప్రతి  ఒక్కరు నులిపురుగు నిర్మూలన మాత్రలను తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి,జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, సింగల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి,వైస్ ఎంపీపీ వీరన్న,  సర్పంచ్ యాకోబు,ఎంపిటిసి గోపాల్ రెడ్డి,తెరాస పార్టీ నేత సీతారాం రెడ్డి,మండల వైద్య డాక్టర్ సుప్రీత ,అధికారులు, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area