కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

* ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య
* వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి సంపత్ నగర్ లో ప్రచారం

టేకులపల్లి,నవంబర్ 11 (జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఇల్లందు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య అన్నారు.టేకులపల్లి మండలం సంపత్ నగర్ గ్రామపంచాయతీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు శనివారంనిర్వహించిన అనంతరం, ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంపత్ నగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి,కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశ పెట్టిన ఆరు సంక్షేమ పథకాలను గురించి ఓటర్లకు వివరించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా 2,500 రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారని, రైతు బరోసా పథకం ద్వారా రైతులతో సమానంగా కౌలు రైతులకు ప్రతిఏటా 15,000 రూపాయలు,వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు,వరిపంటకు 500 రూపాయల బోనస్ గాఅందించడంజరుగుతుందని అన్నారు. యువవికాసం పథకం ద్వారా
ప్రతీ మండలంలో విద్యా బరోసా కార్డుల ద్వారా యువవికాసం పథకంతో విద్యార్థులకు 5లక్షల రూపాయలతో తెలంగాణా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు లబ్ధి పొందనున్నారని, చేయూత పథకం ద్వారా నెలవారీ ఫించన్ 4000 వేల రూపాయలతో పాటుగా,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయల భీమా పథకంఅందించడం జరుగుతుందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా
ప్రతీ కుటుంభానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్క ల్పించనున్నారని, ఇందిరమ్మ ఇళ్ళు పథకం ద్వారా
ఇళ్ళులేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5లక్షల రూపాయలు,ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అధించనున్నట్లు ప్రచారంలో వివరించారు. రానున్న ఎన్నిక