కాంగ్రెస్ నాయకుడు అదిరంజన్ చౌదరిని లోక సభ నుంచి బహిష్కరించాలి.

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు.
సోనియా గాంధీ దిష్టి బొమ్మ దహనం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 28(జనంసాక్షి):
లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లోకసభ నుండి ఆయనను వెంటనే బహిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు డిమాండ్ చేశారు.రాష్ట్రపతి ద్రౌపతిముర్ము గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు ఆమె పేరును అనుచితంగా హేళన పూర్వకంగా ఉచ్చరిస్తూ ఎగతాళి చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నండి నిరసన ర్యాలీ నిర్వహిస్తూ బస్టాండ్ కూడలిలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను జిల్లాఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు అదిరంజన్ చౌదరిని భారతదేశంలోని యావత్ గిరిజన సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.ఇంతటి మూర్ఖత్వం అహంకారం ప్రదర్శించిన ఆయనపై చర్య తీసుకోకపోవ డం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇంతవరకు స్పందించకపోవడం పట్ల తీవ్ర నిరసనను తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి,గంగిశెట్టి నాగరాజు,సూర్యకృష్ణగౌడు, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సునీత,పత్యనాయ క్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి,రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ గౌడ్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్,జిల్లా ఇన్చార్జి జమీల్, కార్యాలయ కార్యదర్శి చిక్కొండ్ర చందు,సూరిబాబు,సీనియర్ నాయకులు మాయనిశ్రీశైలం, మొక్తాల రేణయ్య, శ్రీనివాసయాదవ్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.