కాంగ్రెస్ పార్టీతోనే గద్వాల అభివృద్ధి సాధ్యం

గద్వాల పట్టణంలోని 32.33 వార్డ్ లలోని చింతలపేట్,మద్రాసు పేట్, పెద్ద అగ్రహారం వీధులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ తుమ్మల నరసింహులు యాదవ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ గడపగడప ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను సరితమ్మ అభ్యర్థించారు…అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ మాట్లాడుతూ గత పాలకుల పుణ్యమా పట్టణం అభివృద్ధి జరగలేదని, నిరుపేదలకు ఇండ్లు లేక సంక్షేమ పథకాలు అందడం లేదని,బిఆర్ఎస్ పార్టీ నాయకులకే దక్కయన్నారు…కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద ప్రజలకు ఇచ్చిన ప్లాట్ లను అధికార పార్టీ నాయకులు గుంజుకొని,ఎన్నికల సమయంలో మరోచోట ఇస్తామని మోసం చేశారన్నారు…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లు,500 గ్యాస్ సిలిండర్,2500 మహిళలకు ప్రతి నెల సహాయం తదితర సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు.ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజిపేట్ శంకర్, మధుసూదన్ బాబు,నల్లారెడ్డి, ఇషాక్,నాగేంద్ర యాదవ్,యూసుఫ్, భాస్కర్ యాదవ్, గంజిపేట్ తిమ్మన్న,తిమోతి, రాము యాదవ్, కరాటే సత్యం,నాగ శంకర్, మహిమూద్,వెంకటస్వామి ఆచారి, జహంగీర్,జమల్, రఫీక్ తదితరులు ఉన్నారు