కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

మల్కాజిగిరి,అక్టోబర్29(జనంసాక్షి)
మల్కాజిగిరి నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.
నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ శైలి గార్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే ఎన్నికల సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రజలను వివరించి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి,రఘు ప్రసాద్, కిషన్,రాఘవేంద్ర కుమార్,కిరణ్, జగన్నాథరావు,గంగరాజు,శిరీష్ కర్, చెన్నారెడ్డి,చాకో,చంద్ర శేఖర్, శ్రీనివాస్ యాదవ్,చిత్రా గోకుల్,రాజు, యాదగిరి,పిట్ల శ్రీనివాస్,సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు